కాళేశ్వరం కూల్చివేతకు కుట్రలా ?

Spread the love

మేడిగడ్డ బ్యారేజి కుంగిన ఘటనకు విద్రోహ శక్తులే కారణమా?
కుట్ర కోణాన్ని వెలికి తీసే పనిలో తెలంగాణ పోలీసులు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజుక్టుపై విద్రోహ శక్తులు కుట్రకు తేరా తీశాయా ? కుట్రలో భాగంగానే కాళేశ్వరంలో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీని టార్గెట్ చేశారా ? ఈ నెల 21 న జరిగిన మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయిన ఘటన వెనుక ఏ శక్తులున్నాయి. ఈ ప్రశ్నలన్నింటినీ ఛేదించే పనుల్లో తెలంగాణ పోలీసులు విచారణ చేస్తున్నారు. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ కుంగిపోయిన ఘటనపై ఇరిగేషన్ అధికారులు పోలీసులకు పిర్యాదు చేశారు. . ఇరిగేషన్ శాఖ ఏఈఈ రవికాంత్ ఫిర్యాదు మేరకు మహాదేవ్ పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ నెల 21న సాయంత్రం పెద్ద శబ్దంతో పిల్లర్లు కుంగిపోయినట్టుగా నీటిపారుదల శాఖ ,పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 19,20, 21 పిల్లర్లు కుంగిపోయినట్టుగా ఆ ఫిర్యాదులో రాశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం వెనుక విద్రోహశక్తుల ప్రమేయం ఉందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.ఈ విషయమై దర్యాప్తు చేయాలని కోరారు.
ఇరిగేషన్ శాఖకు చెందిన ఫిర్యాదు అందినట్టుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే చెప్పారు. అయితే ఘటన వెనుక మావోయిస్టుల ప్రమేయం లేదని ప్రాధమిక విచారణలో తేలిందని చెప్పారు. ఈ ఘటన వెనుక ఎవరున్నారనే విషయమై ఆరా తీస్తున్నట్టుగా పోలీసులు ప్రకటించారు. ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన పిర్యాదు మేరకు ఘటనపై పీడీపీపీ సెక్షన్ కు చెందిన మూడు సెక్షన్లతో పాటు ఐపీసీ 427 కింద కేసు నమోదు చేశారు

కుంగిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ: పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీమ్

మరో ప్రక్క మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి చెందిన పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ సీరియస్ గా తీసుకుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాన్ని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ పంపింది.ఈ విషయమై కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు.దీంతో అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందాన్ని రాష్ట్రానికి పంపింది కేంద్రం. ఈ నెల 24న అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. కుంగిన పిల్లర్లను పరిశీలించింది. నిర్మాణ సంస్థ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖ ఇంజనీర్లతో చర్చించింది.
రాజకీయ విమర్శలు
మేడిగడ్డ బ్యారేజి కృంగిన ఘటన రాజకీయంగా మాటల యుద్ధం మొదలయ్యింది. బీజేపీ పార్టీ నాయకులు,కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ అవినీతికి లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనను నిదర్శనంగా పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే లక్ష్మీబ్యారేజీ వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఈ ప్రాంతంలోకి ఎవరిని అనుమతించడం లేదు. బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంతో బ్యారేజీలోని 10 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు.ఒకవేళ ఈ ఘటనలో మావోయిస్టుల ప్రమేయం లేదని పోలీసులు తేల్చేశారు. మరి విద్రోహ శక్తులంటే ఎవరు ? రాజకీయంగా అధికార బిఆర్ఎస్ ను టార్గెట్ చేయడానికి ఈ కుట్రను చేశారా అనే అనుమానంతో పిర్యాదు చేశారా అనేది పోలీసుల విచారణలో తేలనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: