విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం

Spread the love

ఆగివున్న పలాస ప్యాసింజర్ ను ఢీ కొట్టిన రాయగడ ప్యాసింజర్
పట్టాలు తప్పిన మూడు భోగీలు
ఏడుగురు ప్రయాణికులు మృతి
వందల సంఖ్యలో క్షతగాత్రులు
మృతుల సంఖ్య పెరిగే అవకాశం

తెలుగు ట్రాక్,విజయనగరం
విజయనగరంలో రెండు రైళ్లు ఢీ కొన్నాయి. కొత్త వలస మండలం అలమండ కంటకాపల్లి క్రాస్ రోడ్ దగ్గర ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ పట్నం నుండి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైలు అలమండ కోరుకొండ రైల్వే స్టేషన్ సమీపంలోని సిగ్నల్ వద్ద ఆగి వుంది. అదే సమయం లో ఆ పట్టాలపైనుండే ఆ రైలు వెనుక నుండి విశాఖ రాయగడ స్పెషల్ రైలు వచ్చింది. అప్పటికే పట్టాలపై ఆగి వున్న పలాస రైలును వేగంగా వస్తున్నరాయగడ ప్యాసింజర్ ఢీకొంది . ఈ ప్రమాదంలో మూడు భోగీలు పట్టాలు తప్పాయి . ఘటనా స్థలంలోనే ఏడుగురు మరణించారు. అధిక సంఖ్యలో ప్రయాణికులు తీవ్రగాయాల పాలయ్యారు. ఘటన జరిగిన ప్రదేశంలో రైల్వే లైనుపై వున్న విద్యుత్ తీగలు తెగిపడ్డాయి.రెండు దీంతో సహాయక చర్యలకు తీవ్ర అవరోధాలు ఏర్పడ్డాయి. సంఘటన విషయాన్ని తెలుసుకున్న రైల్వే అధికారులు,పోలీసులు సహాయక చర్యలను చేపట్టారు. విజయనగరం ఎ స్పీ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని విశాఖ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక బోగీ నుంచి చిన్నారులు, ప్రయాణికుల ఆర్తనాదాల వినిపిస్తు్న్నాయి. వారిని రక్షించేందుకు ఎలక్ట్రికల్‌ సిబ్బంది, రైల్వే సహాయక సిబ్బంది, ఉన్నతాధికారులు సహాయ చర్యలు చేపట్టారు.సిగ్నలింగ్ వ్యవస్థలోని లోపల వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాధమికంగా అంచనాకు వచ్చారు.

సత్వర సహాయ చర్యలకు సీఎం జగన్ ఆదేశాలు
విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని ఎక్కువ అంబులెన్స్‌లను పంపించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి మంచి వైద్యం అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. సత్వర సహాయక చర్యలు చేపట్టేందుకు, క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా ఆరోగ్య, పోలీసు, రెవెన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలను సమన్వయం చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
హెల్ప్ లైన్ నంబర్లు ఇవే!

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బాధితుల సమాచారం కోసం రైల్వే అధికారులు హెల్ప్‌ లైన్‌ నంబర్లు ఏర్పాటు చేశారు. 0891 2746330, 0891 2744619, 81060 53051, 81060 53052, 85000 41670, 85000 41677, 83003 83004, 85005 85006 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: