మార్పు తథ్యం:పులిపాటి రాజేష్ కుమార్

Spread the love

గత దశబ్దాల కాలంగా పాతబస్తిని ఎంఐఎం నిర్వీర్యం చేసిందని బహదూర్ పుర నియోజకవర్గం కాంగ్రెస్ ఎంమ్మెల్యే అభ్యర్థి పులిపాటి రాజేష్ కుమార్ తెలిపారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా అయన నియోజకవర్గం లోని మోచి కాలనీ, రమ్నస్ పుర ,
తాడ్ బన్, ఐటీఐ, కలపత్తర్, జూపార్క్, తదితర ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా పులిపాటి రాజేష్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. ఆ మార్పు కాంగ్రెస్ తోనే సాధ్యమని కాంగ్రెస్ ను గెలిపించడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. గత 50 ఏళ్లుగా ఎం ఐ ఎం పాత నగరానికి చేసింది ఏమిలేదన్నారు. కొత్తగా వెలుస్తున్న అనేక ప్రాంతాలు అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయని, పాత బస్తి మాత్రం వెనుకంజలో ఉందన్నారు. కాంగ్రెస్ గెలిస్తే 6 గ్యారంటీలు అమలు చేయడంతో పాటు నియోజకవర్గాన్ని సమున్నతంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
తాను గెలిస్తే జరిగే అభివృద్ధికి హామీ ఇస్తూ ఆయన నియోజకవర్గ ప్రజలకు బాండ్ పేపర్ లను సైతం అందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: