నేనే భూమిని కోల్పోయాను

Spread the love

రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ కోసం స్వయంగా 40 సెంట్ల భూమిని కోల్పోవాల్సి వచ్చిందని,అటువంటి తనపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి నారాయణ తెలిపారు. రాజమహేంద్రవరంలోని సెంట్రల్‌ జైలులో భువనేశ్వరి, బ్రాహ్మణితో కలసి నారాయణ చంద్రబాబు నాయుడుతో ములాఖత్‌ అయ్యారు. అనంతరం నారాయణ విూడియాతో మాట్లాడారు. అక్కడ ఆయన మాట్లాడుతూ ఈడ్పుగల్లులో 40 సెంట్ల భూమిని నేను 2001లో కొనగా , ఇన్నర్‌ రింగ్‌ అలైన్‌ మెంట్‌ ప్లానింగ్‌ లో ఆ భూమి పోయిందని తెలిపారు. ఆ భూమి పోయిందని సీఆర్డీఏ అధికారులే మాకు సమాచారం ఇచ్చారన్నారు. . రూ.7 కోట్ల విలువ చేసే నా భూమి పోతే నేనెలా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో అవినీతికి పాల్పడతాను అని ప్రశ్నించారు. ఆరోపణలు చేసినంత మాత్రాన అవి నిజం అయిపోవు. మా బంధువులు కొన్న భూములు కూడా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు 7 కి.విూ దూరంలో ఉన్నాయి. వైసీపీకి సాక్షి పత్రిక ఉందని బురదజల్లడమే తెలుసు. మాకు న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా అన్నారు. . టీడీపీ`జనసేన పొత్తుపైనా త్వరలో కమిటీ నియామకం అవుతుందన్నారు. కమిటీ నిర్ణయాల ప్రకారం ప్రకారం ముందుకు వెళ్తామన్నారు.చంద్రబాబు జైల్లో ఉండాల్సిన వ్యక్తి కాదు.. అయినా తప్పలేదు’’ అని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

అక్రమ అరెస్టుతో జైల్లో ఉన్న చంద్రబాబు ఆలోచన రాష్ట్రం, ప్రజలే. చంద్రబాబు అక్రమ కేసుతో జైల్లో ఉండడం బాధాకరమైనా.. జైలులో చంద్రబాబు మనోధైర్యంగా ఉన్నారు. తనకు అండగా నిలుస్తున్న ప్రజలకు, మద్ధతు తెలిపిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు చెప్పాలని, అధికార పార్టీ చేసే అక్రమాలు, దౌర్జన్యాలను ప్రశ్నించాలని చంద్రబాబు చెప్పారు’’ అని నారాయణ అన్నారు.ఇంకా నారాయణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలిపేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. చంద్రబాబు పర్యటనకు రాష్ట్రంలో వస్తున్న ప్రజా స్పందన చూసే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని నారాయణ అన్నారు. రింగ్‌ రోడ్డు అంశంలో లోకేష్‌ పైనా కేసు పెట్టారు. దీనిపై 41ఏ నోటీసులు ఇస్తామని హైకోర్టుకు ఏజీ తెలిపారు. ఇది మా మొదటి విజయం. రాష్ట్రంలో వైసీపీ ఏం చేస్తోందో ప్రజలందరికీ తెలుసు. టీడీపీకి ప్రజల నుంచి వచ్చే మద్ధతును వైఎస్‌ఆర్‌ సీపీ ఓర్చుకోలేక పోతుందని.. అందుకే కేసులు, అరెస్ట్‌ లు చేస్తుందని నారాయణ అన్నారు. అయినా పార్టీకి రెండిరతల బలం పెరుగుతోంది. రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదు. రైతులు, ఉద్యోగులు, కూలీలు, యువత అందరూ ఇబ్బంది పడుతున్నారు. 6 నెలల్లో ఎన్నికలు పెట్టుకుని చంద్రబాబు అరెస్టు చేయడం రాజకీయ కక్షే.. దీనికి వైసీపీ కి ప్రజలే త్వరలో బుద్ధి చెప్తారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: